1 July, 2026 | 6:43 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •  

ప్రజలు మెచ్చేలా సీఎం రేవంత్ పాలన

31-03-2025 01:24 AM

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరుగులు

పాలకుల్లో పెరగనున్న పోటీతత్వం

వర్షాలు బాగా కురుస్తాయ్

రవీంద్రభారతిలో సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రజలందరూ మెచ్చేలా సీఎం రేవంత్‌రెడ్డి పాలన ఉంటుదని పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఉగాదిని పురస్కరించుకొని రవీంద్రభారతిలో పంచాగశ్రవణం చేశారు. ‘రాష్ట్రం ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతుంది. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు మంచికాలం. తెలంగాణ రాష్ట్రం మిథున రాశి, పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించింది. పాలకుల మధ్య పోటీతత్వం పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటాపోటీగా పాలన సాగిస్తారు. వర్షాలు బాగా కురుస్తాయి. రైతులు ఆనందంగా ఉంటారు. బియ్యం కొరత ఏర్పడుతుంది. సీఎం తెలివితేటలతో ధన, ధాన్యాలకు ఎలాంటి కొరత ఉండదు. సోషల్ మీడియా ప్రజలను ఇబ్బం ది పెడుతుంది. ఎర్ర రేగడి భూముల, ఎర్రటి ధాన్యాలు మంచి ఫలితాలు ఇస్తాయి. శాంతి భద్రతల విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. ఆదివారం తెలంగాణ ప్రజ లు మాంసం, మందు ముట్టకుంటే అంతా మంచి జరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు’ అని సంతోష్ కుమార్ పేర్కొన్నారు.