calender_icon.png 19 August, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

19-08-2025 04:59:00 PM

రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా అమ్మకాలు జరపాలి

విష జ్వరాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

వరదల కారణంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

డోర్నకల్,(విజయక్రాంతి): ప్రభుత్వం కల్పించిన మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల ప్రజా పరిషత్ పాఠశాల, ఫర్టిలైజర్ షాప్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా అర్థమయ్యే విధంగా విద్యాబోధనలు అందించాలన్నారు.

పాఠశాల పరిసరాలు, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, క్రమం తప్పకుండా శానిటేషన్ నిర్వహించాలని అన్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించవద్దని,రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మకాలు జరపాలని, నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తగినన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వర్షాకాలం వరదల కారణంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.