హుస్సేన్ నాయక్ను పరామర్శించిన కలెక్టర్, ఎస్పీ
27-03-2026 02:37 AM
మహబూబాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): ఇటీవల పితృవియోగానికి గురైన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ను గురువారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఎస్పీ డాక్టర్ శబరీష్ పరామర్శించారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల పరిధిలోని మచ్చర్లలో నిర్వహించిన లచ్య నాయక్ దశదినకర్మకు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు మచ్చర్లకు వచ్చి హుస్సేన్ నాయక్ ను పరామర్శించారు.




