29-05-2025 12:11:06 AM
- పైలెట్ ప్రాజెక్టు భోరజ్ మండలంలో పర్యటన
అదిలాబాద్, మే 28 (విజయ క్రాంతి): భూ భారతి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన భోరజ్ మండలంను బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు.
ఈ సం దర్భంగా తహశీల్దార్ కార్యాలయంలో భూ భారతి పథకం కింద వచ్చిన దరఖాస్తుల పై ఆరా తీశారు. మొత్తం 1067 దరఖాస్తులు రాగా వాటిని కలెక్టర్ పరిశీలించారు. 142 దరఖాస్తులు తిరస్కరించినట్లు, ఇందులో 494 దరఖాస్తులు అమోదించినట్లు తెలిపా రు. 249 దరఖస్తులకు నోటిసు జరీ చెయ్య డం జరిగిందన్నారు.
ఈ దరఖాస్తులను క్షు ణ్నంగా పరిశీలించడం జరిగిందనీ, సంబందిత దరఖాస్తుదారులకు సమాచారం తెలి యజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ వినోద్ కుమార్, తహసీల్దార్లు రాజేశ్వ రీ, నలంద ప్రియ పాల్గొన్నారు.