17-06-2025 09:03:14 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలో 2025-26 సంవత్సరానికి గాను వర్షాకాలం పంట సాగుచేసే రైతులకు జిల్లాలో లబ్ధి పొందిన రైతుల వివరాలను కలెక్టర్ జితేష్ వి పాటిల్(District Collector Jitesh V Patil) మంగళవారం విడుదల చేశారు. జిల్లాలో గత యంసంగిలో వున్న పట్టాదారుల సంఖ్య-1,78, 545 గాను ఈ వానాకాలం కొత్తగా ఇచ్చిన పట్టాదారుల సంఖ్య-1023, గత సీజన్లో బ్యాంకు వివరాలు సరిగా లేని పట్టాదారుల సంఖ్య -832, 550 మంది గతంలో బ్యాంకు వివరాలు నమోదు చేయనివారు వున్నారు. వానాకాలం పంటకు సంబంధించి ఇప్పటి వరకు జిల్లాలో 1,79, 535 మంది లబ్ధిదారుల వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా సేకరించి పోర్టల్ లో నమోదు చేయటం జరిగినది.
వీటికి సంబంధించి ఈనెల 16వ తేదీ వరకు 1,48,823 మంది లబ్ధిదారులకు గాను రూ. 186,38,77,971 ట్రెజరీకి పంపటం జరిగిందన్నారు. సోమవారం నాటికి 83,271 మంది లబ్ధిదారులకు గాను రూ 56,69,78,012/- నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయటం జరిగినది. మంగళవారం మరో 30,127 మంది లబ్ధిదారులకు గాను రూ 45,41,05671/- నేరుగా రైతుల ఖాతాలో జమ చేయటం జరిగిందన్నారు. మొత్తం లబ్దిదారులు - 1,13,398 లబ్ధిదారులు గాను రూ 102,10,83,683/ జమ చేయడం జరిగింది. నూతనంగా పట్టాలు పొందిన రైతులు తమయొక్క పట్టాదారు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ నకలును సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పించి రైతు భరోసా పోర్టల్ నందు నమోదు చేసుకోనవలసినదిగ రైతులను కలెక్టర్ కోరారు. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందుతుందని ఎటువంటి రైతులు ఆందోళనలు చెందవద్దని కలెక్టర్ తెలిపారు.