calender_icon.png 18 June, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం

17-06-2025 09:05:00 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): అమ్మమాట అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగిందని అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన అన్నారు. మంగళవారం దౌల్తాబాద్ మండలం(Doultabad mandal) ఇందుప్రియాల్ గ్రామంలో అంగన్వాడి కేంద్రం-3 లో అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ... అంగన్వాడీ కేంద్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోషక పదార్థాలను ఉచితంగా చిన్నారులకు, గర్భవతులకు, బాలింతలకు పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందన్నారు.

చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తూ, ఆటపాటలతో కూడిన విద్యాబోధన చేయడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి తోడ్పాటునందించడం జరుగుతుందన్నారు. మూడు సంవత్సరాలు దాటిన పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రాలకు పంపాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. బాడిబాటలో భాగంగా టీచర్లు రెండున్నర నుంచి ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించి వారిని అంగన్వాడి కేంద్రాలకు పంపించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఆయా పెంటమ్మ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.