13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

పదిలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలి

19-01-2026 09:39 PM

* కొడపాక ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

* స్పీడప్ గా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జరగాలి

విజయక్రాంతి,పాపన్నపేట: పదవ తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని, ప్రతి ఒక్క విద్యార్థి పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని, విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సోమవారం మండల పరిధిలోని కొడపాక ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.

విద్యార్థులు ఏ సబ్జెక్టులలో వెనకబడి ఉన్నారో తెలుసుకొని వారి పై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులతో మాట్లాడుతూ.. సేలబస్ ఎంత వరకు అయింది? ఎలా చదువుతున్నారు? హాజరు ఎలా ఉంది ? అని అడిగారు. సోషల్ మీడియా కు దూరంగా ఉండి చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం కొడపాక గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.