బ్యాలెట్ యూనిట్లను పరిశీలించిన కలెక్టర్

02-05-2024 01:32:33 AM

వరంగల్, మే 1 (విజయక్రాంతి): వరంగల్  ఏనుమాముల మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాంకు ఈసీఐఎల్ నుంచి వచ్చిన వెయ్యి అదనపు బ్యాలెట్ యూనిట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య బుధవారం పరిశీలించారు. ఈసీఐఎల్ ఇంజినీర్లతో కలిసి మొదటి దశ చెకింగ్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వరంగల్ నుంచి 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున అదనంగా బ్యాలెట్ యూనిట్లను తెప్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, ఎన్నికల పర్యవేక్షకుడు విశ్వనారాయణ, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.