టీఎస్పీఎస్సీ ప్రకటన
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): జూన్ 9న జరిగే గ్రూప్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి రాష్ట్రంలోని ఉద్యోగార్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. ఓఎంఆర్ పద్ధతిలో ఆఫ్లైన్లోనే గ్రూప్ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ బుధవారం తెలిపారు. 563 పోస్టులు భర్తీకిగానూ గ్రూప్ నోటిఫికేషన్ను ఈ ఏడాది ఫిబ్రవరి 19న జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్లో ప్రిలిమినరీ పరీక్షను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ క్రమంలోనే దీనిపై స్పష్టతనిస్తూ ఆబ్జెక్టివ్ టైప్లో ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షను ఉదయం సెషన్లో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.