01-06-2025 12:00:00 AM
అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్రెడ్డిని నాగార్జున, అమల దంపతులు కలిశారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం రేవంత్రెడ్డిని కలిసిన ఈ దంపతులు తమ కుమారుడు అఖిల్ వివాహ వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. గత నవంబర్లో అక్కినేని అఖిల్కు జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
అఖిల్ పెళ్లి జూన్ 6న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో సాదాసీదాగా జరగనుందని సమాచారం. అఖిల్ ‘సిసింద్రీ’ చిత్రంతో బాలనటుడిగా వెండితెరపై కనిపించాడు. 2015లో ‘అఖిల్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ‘లెనిన్’లో నటిస్తున్నాడు.