2 May, 2026 | 1:51 AM

స్మశానవాటికల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయం

02-05-2026 12:00 AM

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి 

కామారెడ్డి, మే 1 (విజయక్రాంతి): కామారెడ్డిలో స్మశానవాటికల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ముందుకు రావడం అభినందనీయమని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కామారెడ్డి అభివృద్ధికి సేవ చేసినందుకు ముందుకు వచ్చే వారికి స్వాగతం పలుకుతామన్నారు. కామారెడ్డి సాగర్ సంఘం ప్రజలకు ఈ విషయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వైకుంఠధామం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డిని త్వరలో స్వయంగా కలిసి అభినందిస్తామన్నారు. కామారెడ్డి కలెక్టర్ నుంచి ఎన్‌ఓసిపించడానికి అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లి ఎన్‌ఓసిపి ఇప్పిస్తామన్నారు.

గతంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కామారెడ్డి స్మశాన వాటికలా అభివృద్ధికి పట్టించుకోలేదని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఉన్నప్పుడు టు పిట్ కో పండు నుంచి కోటి రూపాయలు విడుదల కాగా, సంబంధించిన అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పను లు ఆ సంపూర్తిగా నిలిచిపోయాయి  అన్నారు. నీల రక్షణ వహించిన కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ గడ్డమీద మహేష్, డిసిసి కార్యదర్శి జూలూరు సుధాకర్, క్రేడా అధ్యక్షులు నర్సా గౌడ్, మాజీ కౌన్సిలర్లు జమీల్, చాట్ల వంశీ, సలీం, కాంగ్రెస్ నాయకులు రంగా రమేష్ గౌడ్, మెహర్ బాబా గౌడ్, నర్సుల మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.