ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి
టీఆర్పీ నాయకుల డిమాండ్
హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాం తి): చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం ఉప్పెర మల్యాల గ్రామ రెవె న్యూ పరిధిలో నీటి కొరత కారణంగా ఎండిపోయిన పంట పొలాలను తెలంగాణ రా జ్యాధికార పార్టీ నాయకులు కొప్పుల వెంకటేష్ సోమవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ నారాయణపూర్ రిజర్వాయ ర్ కుడి కాలువ నిర్మాణం జరగకపోవడంతో పరిసర గ్రామాల రైతులు నష్టాలు చవిచూస్తున్నారన్నారు.
ఉప్పెర మల్యాల వెం కంపల్లి గ్రామానికి చెందిన రైతులు మల్యా ల అనిల్, మధుసుదన్ రెడ్డి, ముక్కెర పర్షరాములు తదితరుల ఎండిపోయిన పంటలను పరిశీలించి, వారి పరిస్థితిని తెలుసుకున్నారు. చెరువుకు కేవలం మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న పొలాలు కూడా నీటి లభ్యత లేక ఎండిపోవడం చాలా దురదృష్టకరమని తెలిపారు.
ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకొని కాలువ పనులు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాం డ్ చేశారు. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కొప్పుల వెంకటేష్, గంగాధర మండల అధ్యక్షుడు ముక్కెర గంగరాజు, యువజన విభాగం అధ్యక్షుడు పలుమారి సతీష్, యూత్ ప్రధాన కార్యదర్శి బండ గంగరాజు, గుండవేణి నరేష్లున్నారు.




