15 June, 2026 | 2:04 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

కొండంపేట ఎన్నిక ఫలితాలపై ఫిర్యాదు

20-12-2025 12:39 AM

చెన్నూర్, డిసెంబర్ 19 : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొండంపేట ఎన్నిక ఫలితాల్లో తారుమారు జరిగినట్లు సర్పంచ్ అభ్యర్థి నీల సంతోషి గ్రామస్తులతో కలిసి శుక్ర వారం ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాను పోటీలో ఉండగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో తప్పుడు ఫలితాలు ప్రకటించారని ఆరోపించారు.

రీ కౌంటింగ్ కు అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ నుంచి పోటీచేసిన అభ్యర్థిని గెలుపొందినట్లు ప్రకటించార న్నారు. అధికారులు ఏకపక్షంగా ఉండి కొండంపేట సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో తారుమారు చేశారని, ఇప్పటికైనా అధికారులు రీకౌంటింగ్ జరిపించి న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై ఆర్డీవోకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.