03-11-2025 06:53:38 PM
గద్వాల: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 132 ఫిర్యాదులు అందాయి. ఇందులో ఎక్కువగా ఇందిరమ్మ గృహాల మంజూరు కొరకు 60 దరఖాస్తులను అర్జీదారులు అందజేశారు.
అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు కూడా వివిధ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.