19-06-2025 12:03:51 AM
గుంటూరు, జూన్ 18: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం మృతి పార్టీకి తీరని లోటని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు తాళ్ల వెంకటేశ్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం విశాఖపట్నంలోని పల్లా శ్రీనివాస్ స్వగృహానికి చేరుకున్న ఆయన, సింహాచలం ఫొటోకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
సింహాచలం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు. సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉన్న ఆయన విశాఖ నగరం, పరిసర ప్రాంతాల్లో సమస్యలపై పోరాడారని గుర్తుచేశారు. పితృవియోగంతో బాధపడుతున్న పల్లా శ్రీనివాస్రావుకి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.