6 July, 2026 | 3:09 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

రైలు ప్రయాణం ఆగం ఆగం.!

26-05-2025 08:21 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): కాజీపేట విజయవాడ సెక్షన్ లో మహబూబాబాద్ రైల్వే స్టేషన్(Mahabubabad Railway Station) వద్ద ఎన్ఐ, మూడో లైన్ పనుల నేపథ్యంలో వివిధ రైళ్లను దారి మళ్లింపు, మరికొన్ని రైళ్లకు ప్రత్యామ్నాయంగా కేసముద్రంలో హాల్టింగ్ కల్పించడంతో మహబూబాబాద్ ప్రాంత రైల్వే ప్రయాణికుల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. కాజీపేట విజయవాడ వైపు వెళ్లే రైళ్లను మహబూబాబాద్ లో నిలుపుతుండగా, విజయవాడ కాజీపేట మార్గంలో వెళ్లే రైళ్లను మహబూబాబాద్ లో నిలపకుండా కేసముద్రంలో నిలుపుతున్నారు. 

అయితే చాలా మందికి ఏ వైపు రైళ్లు అగుతున్నాయో.. ఏ మార్గంలో ఆగడం లేదో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. కొన్ని రైళ్లను మహబూబాబాద్ స్టేషన్కు కాస్త దూరంలో నిలుపుతుండడంతో ప్రయాణికులు అందులో నుంచి దిగి కాలినడకన మహబూబాబాద్ చేరుకుంటున్నారు. రైలు దిగలేని పరిస్థితిలో ఉన్నవారు కేసముద్రంలో దిగి ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాహనాల్లో తిరిగి మహబూబాబాద్ చేరుకుంటున్నారు. రైళ్ల నిలుపుదల అంశం పూర్తిగా ప్రయాణికులను గందరగోళానికి గురిచేస్తుందని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.