పార్టీలో ప్రదీప్గౌడ్ చేరికపై కార్యకర్తల గరంగరం
మహబూబ్నగర్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల వేళ మహబూబ్నగర్ కాంగ్రెస్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గ పరిధిలోని దేవరకద్రలో పార్టీ మారిన ఓ నేత తిరిగి కాంగ్రెస్ గూటికి రావడంతో శ్రేణులు మండిపడుతున్నాయి. ఏకంగా అసెం బ్లీ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ ప్రచారం బంద్కు పిలుపునిచ్చాయి. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నుంచి కాటంప్రదీప్గౌడ్ కాంగ్రెస్ టికెట్ ఆశించారు. పార్టీ మధుసూదన్రెడ్డికి టికెట్ ఇచ్చింది.
అధిష్ఠానం నిర్ణయా న్ని వ్యతిరేకిస్తూ ఆ సమయంలో ప్రదీప్గౌడ్ మహబూబ్నగర్ పార్టీ కార్యా లయంలో నానా హంగామా చేశారు. పార్టీ నియమ నిబంధనలు పాటించలేదని ప్రదీప్గౌడ్ను అధిష్ఠానం పార్టీ నుంచి బహిష్కరించింది. దీంతో ప్రదీప్గౌడ్ బీఆర్ఎస్లో చేరారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రదీప్గౌడ్ గురువారం తిరిగి కాంగ్రెస్లో చేరారు. దీంతో ఆగ్రహించిన నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయ కులు నిరసన వ్యక్తం చేశారు. ప్రదీప్గౌడ్ను పార్టీ నుంచి వెంటనే బహిష్క రించాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గంలో నేటి నుంచి ప్రచారం చేయ బోమని ఆయా మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకటించారు. మహబూబ్నగర్ ఎంపీ ఎన్నికపై ఈనిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందోనని నాయకులు తలలు పట్టుకున్నారు.