16-02-2026 02:40:39 PM
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిజామాబాద్ లో ఎక్కువ వరి దిగుబడి వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ... నిజామాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందేందుకు నిధులు కేటాయిస్తామని తెలిపారు.
అటు నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్త'గత'మైంది. నిజామాబాద్ మేయర్ గా ఉమారాణి, డిప్యూటీ మేయర్ గా సల్మా తహసీన్ ఎన్నికయ్యారు. ఎంఐఎం సహకారంతో నిజామాబాద్ మేయర్ గెలిచామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వెల్లడించారు. నిజామాబాద్ అభివృద్ధికోసమే ఎంఐఎంతో కలిశామని తెలిపారు. బీసీలకి నిజామాబాద్ మేయర్ పదవి కట్టబెట్టామని చెప్పారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ లను బీజేపీ అడ్డుకున్నా పార్టీ పరంగా న్యాయం చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో నిజామాబాద్ అభివృద్ధి చేస్తామని మహేష్ గౌడ్ హామీ ఇచ్చారు.