7 April, 2026 | 12:01 PM

Breaking News

తెలంగాణలో గడ్డి మందు నిషేధం   •   సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన.. జూనియర్ లాయర్ హత్య   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •  

నిజామాబాద్ కార్పొరేషన్ హస్త'గతం'

16-02-2026 02:40 PM

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిజామాబాద్ లో ఎక్కువ వరి దిగుబడి వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ... నిజామాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందేందుకు నిధులు కేటాయిస్తామని తెలిపారు.

అటు నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్త'గత'మైంది. నిజామాబాద్ మేయర్ గా ఉమారాణి, డిప్యూటీ మేయర్ గా సల్మా తహసీన్ ఎన్నికయ్యారు. ఎంఐఎం సహకారంతో నిజామాబాద్ మేయర్ గెలిచామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వెల్లడించారు. నిజామాబాద్ అభివృద్ధికోసమే ఎంఐఎంతో కలిశామని తెలిపారు. బీసీలకి నిజామాబాద్ మేయర్ పదవి కట్టబెట్టామని చెప్పారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ లను బీజేపీ అడ్డుకున్నా పార్టీ పరంగా న్యాయం చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో నిజామాబాద్ అభివృద్ధి చేస్తామని మహేష్ గౌడ్ హామీ ఇచ్చారు.