24 June, 2026 | 2:30 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

బోడుప్పల్‌లో ఘనంగా కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

28-12-2025 04:35 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): జీహెచ్ఎంసీ పరిధి బోడుప్పల్  సర్కిల్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 141వ భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  తోటకూర వజ్రెష్ యాదవ్  హాజరై కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర అమూల్యమని, ప్రజాసేవే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.  పార్టీ సిద్ధాంతాలు, విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.