07-05-2024 12:03:12 AM
వీసీల నియామకాలపై కాంగ్రెస్ నేత అసత్య ఆరోపణలు
రాజకీయ మైలేజీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు
181 మంది మాజీ, ప్రస్తుత వీసీల బహిరంగ లేఖ
న్యూఢిల్లీ, మే 6: విశ్వవిద్యాలయాల్లో వైస్చాన్స్లర్ల నియామకంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని 181 మంది ప్రస్తుత, మాజీ వీసీలతో పాటు ఏఐసీటీఈ ఉన్నతాధికారులు బహిరంగ లేఖ రాశారు. వర్సిటీల్లో నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రతిభ ఆధారంగా కాకుండా కొన్ని సంస్థలతో అనుబంధం ఉన్నవారిని నియమి స్తున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. వీసీల ఎంపిక ప్రతిభ, విద్య, పరిపాలనా నైపుణ్యంపై ఆధారపడి ఉంటుందని, ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంద ని చెప్పారు.
రాహుల్గాంధీ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యా సంస్థల అధినేతలుగా నైతిక, సంస్థాగత, సమగ్రత రక్షణలో నిబద్ధత కలిగి ఉన్నామని, నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. దేశంలో యూని వర్సిటీలు ప్రపంచస్థాయిలో పరిశోధన, ఆవిష్కరణల్లో ముందున్నాయని, వర్సిటీల అభివృద్ధిలో తమ పాత్ర కూడా ఉందని వివరించారు. ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న వ్యక్తులను వీసీలుగా నియమిస్తున్నారని రాహుల్ గతంలో ఆరోపించారు. ఈ బహిరంగ లేఖపై ఢిల్లీ వర్సిటీ వీసీ యోగేశ్ సింగ్, ఏఐసీటీఈ చైర్మన్ సీతారాం, జేఎన్యూ వీసీ శాంతిశ్రీ, అంబేడ్కర్ నేషనల్ లా యూనివర్సిటీ వీసీ సంతకం చేశారు.