calender_icon.png 24 June, 2025 | 10:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరంపై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్

07-06-2025 12:26:09 PM

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(BRS MLA Harish Rao) కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్(Harish Rao PowerPoint Presentation) ఇచ్చారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్ల. కాళేశ్వరం అంటే.. 21 పంప్ హౌస్ లు, 203 కి.మీ సొరంగాలు. కాళేశ్వరం అంటే.. 1531 కి.మీ గ్రావిటీ కాలువలు, 98 కి.మీ. ప్రెజర్ మెయిన్స్ అన్నారు. 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీటి ఎత్తిపోతలు. కాళేశ్వరం ద్వారా 240 టీఎంసీల నీటివినియోగం అయిందని హరీశ్ రావు తెలిపారు. మేడిగడ్డలో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి.. ఒక బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు కూలినట్లు చెప్తున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీని 7 బ్లాకులుగా 85 పియర్లుగా నిర్మించారు.

తుమ్మడిహట్టి(Tummidihetti Barrage) నుంచి ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోసేలా మొదట రూపకల్పన చేశారు. తుమ్మడిహట్టి వద్ద నీళ్లు తక్కువ ఉంటాయని ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చామని తెలిపారు. కాళేశ్వరం లేకుండా పంటలు పండాయని కాంగ్రెస్ చేస్తోంది.. కాళేశ్వరం ప్రాజెక్టుకు 3 వనరుల ద్వారా నీటి లభ్యత ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వేలాది చెరువులు నింపొచ్చని హరీశ్ రావు(Harish Rao) సూచించారు. కాళేశ్వరం వల్లనే యాసంగిలోనూ పంటలు పండాయని చెప్పారు. మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్ వరకు నిర్మించి నవన్నీ వాడకంలోనే ఉన్నాయని తెలిపారు. కాళేశ్వరం కింద కాలువల ద్వారానే 90 వేల ఎకరాలకు నీరు అందినట్లు పేర్కొన్నారు. మొత్తం కాళేశ్వరం ద్వారా 20.23 లక్షల ఎకరాలకు నీరు అందించామన్నారు. రాష్ట్ర విభజన సయమంలో తెలంగాణకు గోదావరి జలాల్లో 940 టీఎంసీలు కేటాయించారు.. తెలంగాణ గోదావరి జలాలను ఏనాడు 400 టీఎంసీలకు మించి వాడుకోలేదని వివరించారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు(Pranahita Chevella Lift Irrigation Project) కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్లలో అనుమతులు కూడా సాధించలేదని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించకుండానే కాలువల తవ్వకం పనులు చేపట్టారని పేర్కొన్నారు. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద రూ. 2328 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారు. జలయజ్ఞాన్ని ధన యజ్ఞం అని ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. 2007లో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 17 వేల కోట్లుగా చెప్పారన్నారు.

ప్రాజెక్టు పనులు ప్రారంభించక ముందే 2011 నాటికి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ. 40 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పకుండా చర్చలు జరిపామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులకే మహారాష్ట్రకు వెళ్లి చర్చించి ఒప్పించామన్నారు. పరిహారం ఎంతకావాలంటే అంత ఇస్తామని మహారాష్ట్రకు చెప్పాం.. 150 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పుకునేది లేదని మహారాష్ట్ర ప్రభుత్వం(Government of Maharashtra) చెప్పిందని వివరించారు. ఏపీ, మహారాష్ట్ర, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ ప్రాణహితకు వాళ్లు ఒప్పుకోలేదు.. చివరకు ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే.. మాకు అభ్యంతరం లేదని మహారాష్ట్ర చెప్పిందని హరీశ్ రావు తెలిపారు. అంతరాష్ట్ర సమస్యలు ఉన్న చోట ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ డిజైన్ చేసింది.