calender_icon.png 6 June, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మృతి ఇరానీకి ఓటమి భయం పట్టుకుంది

07-05-2024 12:01:58 AM

ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ఎద్దేవా

అమేథీ, మే 6 (విజయక్రాంతి): ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ దాడులు, ప్రతిదాడులతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. అయితే, ఈ దాడి వెనుక స్మృతి ఇరానీ హస్తముందంటూ సోమవారం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ గూండా లు కాంగ్రెస్ ఆఫీస్ వద్ద ఉన్న పలు కార్లను ధ్వంసం చేశారని విమర్శించింది. ఆ ప్రాంతంలో గందరగోళం సృష్టించినట్లు తెలిపింది. ఈ దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. దాడి వెనుక అమేథీ సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఉందని మండిపడ్డారు. కాగా, ఈ దాడికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా విడుదల చేసింది. “అమేథీలో స్మృతి ఇరానీ, బీజేపీ కార్యకర్తలకు ఓటమి భయం పట్టుకుంది. ముందే ఓటమిని ఊహించి, గూండాలు కర్రలు, రాడ్లతో కాంగ్రెస్ కార్యాలయం వెలుపల పార్క్ చేసి ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. ఇది అమేథీ ప్రజలపై జరిగిన దాడిగా భావిస్తున్నాం” అని పోస్టులో పేర్కొంది.