03-05-2025 04:58:50 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వం ఇచ్చిన సన్నబియ్యంతో ఖైరతాబాద్ నియోజికవర్గ కాంగ్రెస్ నాయకులు సహపంక్తీ భోజనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్న బియ్యం పంపిణిలో భాగంగా శనివారం సోమాజిగూడలోని బీఎస్ మక్తాలో నివాసం ఉంటున్న సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో టీపీసీసీ సోమాజిగూడ డివిజన్ అధ్యక్షుడు నరికెలా నరేష్ , యువజన నాయకులు భోజనం చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ... సన్న బియ్యం పథకంతో పేదవాళ్ల జీవితాల వెలుగులు రావటం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సోమాజిగూడ డివిజన్ అధ్యక్షుడు నరికెలా నరేష్ , జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు హరిధర్, ఖైరతాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ నాయక్, సోమాజిగూడ డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.