నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి
మహబూబ్నగర్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): రాజకీయం వేరు.. కుటుంబం వేరని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి అన్నారు. మహబూబ్నగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టి ఇతర పార్టీలకు పనిచేసే అవసరం తనకు లేదన్నా రు. డీకే అరుణ తనకు అత్త అయినా పార్టీలపరంగా తనకు సంబంధం లేదన్నారు. పని పాట లేని వారు ఎన్నో మాట్లాడుతుంటారని వాటిని పట్టించుకోమని తెలిపారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.