calender_icon.png 21 July, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలి

21-07-2025 05:42:04 PM

అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి..

బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది..

ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏఐసీసీ కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ సంపత్ కుమార్ అన్నారు. సోమవారం నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, గ్రామాలలో మీరే ఒక ముఖ్యమంత్రిగా, మంత్రిగా నాయకునిగా పార్టీ పటిష్టం కొరకు పని చేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక స్థానాలు గెలిపించే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు జీవన్మరణ సమస్య ఈ సమస్య అని, స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

ఆరు గ్యారెంటీలు కొనసాగుతాయని ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాటిని పూర్తి చేస్తాం. తెలంగాణ ఆర్థిక పరిస్థితి పరిపుష్టిగా ఉందని నిర్ణయించుకొని ఆరు గ్యారెంటీలను మేనిఫెస్టోలో పెట్టాం, కానీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేతికి చిప్ప వచ్చిందనీ,మెల్ల మెల్లగా ఆర్థిక వనరులను సమకూర్చుకొని ఆరు గ్యారెంటీ లను కచ్చితంగా అమలు చేస్తాం అన్నారు. భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఆలోచన విధానంతో ఒకే అభిప్రాయంతో ఉంటుందని చెప్పారు.గత పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రజలు మానసికంగా కృంగిపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఫలాలు అందుతున్నాయని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేద,బడుగు,బలహీన ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని,ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న కొత్త రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి,రైతు రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలను గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.కాంగ్రెస్ పార్టీ వైపు వివిధ పార్టీల నేతలు ఆకర్షితులవుతున్నారని అన్నారు. తెలంగాణలో అందరి దృష్టి నలగొండ పైనే ఉంటుందని, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజ్,ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లు చెప్పడం జరిగిందని అన్నారు. అందరినీ కలుపుకొని సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంస్థ గత ఎన్నికల్లో నాయకులని ఎంపిక చేసి రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకుని అందరికీ తగు న్యాయం చేస్తాం అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్లగొండ,తిప్పర్తి,కనగల్ మాజీ జెడ్పిటిసిలు వంగూరి లక్ష్మయ్య,పాశం రామ్ రెడ్డి, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, నల్లగొండ మాజీ ఎంపీపీ మనిమద్ది సుమన్, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుప్ రెడ్డి, ఆర్టిఏ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి, నల్గొండ పిఎసిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జూలకంటి వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లి సుభాష్ యాదవ్, జూలకంటి శ్రీనివాస్, అరుణాకర్ రెడ్డి,వంగాల అనిల్ రెడ్డి దుబ్బ అశోక్ సుందర్, చింత యాదగిరి,మామిడి కార్తీక్, గాలి నాగరాజు, పాదం అనిల్, వెంకన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.