కానిస్టేబుల్ మానవత్వం
31-03-2026 08:31 PM
సిద్దిపేట క్రైం: అత్యవసర సమయంలో ఒక రోగికి సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ శేఖర్ రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మేడారం ప్రాంతానికి చెందిన ఒక రోగికి అత్యవసర చికిత్స నిమిత్తం 'ఓ పాజిటివ్' రక్తం అవసరమని తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే, కానిస్టేబుల్ శేఖర్ రక్తనిధి కేంద్రానికి చేరుకున్నారు. రక్తదానం చేసి వ్యక్తి ప్రాణాలను కాపాడడంలో తనవంతు కృషి చేశారు.




