22-05-2025 12:07:42 AM
కుత్బుల్లాపూర్, మే 21 (విజయ క్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్ రాంజీ కుంట ఎఫ్ టి ఎల్ లో సన్ షైన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే గృహ నిర్మాణ సంస్థ చేపడుతున్న అక్రమ నిర్మాణం బయట పడింది. సర్వే నెంబర్ 562 లో ఉన్న రాంజీ కుంటని ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 536లో ఈ సంస్థ అక్రమ కట్టడం కొనసాగిస్తోంది.
పక్కనే కుంట ఉండడంతో ఫుల్ ట్యాంక్ లెవల్ నుండి పాటించాల్సిన దూరం పాటించి నిర్మాణం చేపట్టాలి. అలా చేయకుండా నిబంధనలను బేఖాతర్ చేస్తూ ఎఫ్ టి ఎల్ లోనే నిర్మాణం సాగిస్తున్నారు. ఇక ఈ బడా గృహ నిర్మాణ సంస్థకు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అండ పుష్కలంగా ఉందం టూ ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
వారి అండతోనే సన్ షైన్ ఇంతకు బరితెగించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమ్యాయాలకు అలవాటు పడిన అధికారులు చెరువులు, కుంటలను, ప్రభుత్వ స్థలా లను కాపాడటం లో విఫమవుతున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
హైడ్రా ఏర్పాటైనా......
నగరంలో చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. వీటిని సంరక్షించడానికి ప్రభుత్వం హైడ్రా తీసుకోవచ్చింది. హైడ్రా ఏర్పాటైన తర్వాత నగరం లో అనేక ఆక్రమణలు తొలగించింది. కొన్ని కాలనీలకు దారి చూపింది. కొన్ని చోట్ల కొంతమంది ఇంకా ఆక్రమణలకు పాల్పడుతూ నే ఉన్నారు. అందులో బౌరంపేట్ రాంజీ కుంట ఒకటి. ఏకంగా ఎఫ్డిఎల్ పరిధి లో భారీ నిర్మాణాలు చేపట్టారు.
ఇందులో రెవిన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం కూడా కనిపిస్తోంది. ఈ రెండు శాఖలు అసలు పట్టించుకోవడం లేదు. హైడ్రా అధికారులు దృష్టి సారించి సన్ షైన్ చేస్తున్నటువంటి అక్రమ నిర్మాణంపైన అలాగే నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మాకేం సంబంధం లేదు..
ఇరిగేషన్ శాఖకు ఫిర్యాదు చేయండి
సన్ షైన్ కుంట ఎఫ్ టీ ఎల్ లో చేపడుతున్న నిర్మాణంపై మండల తహసీ ల్దార్ సయ్యద్ మతిన్ను వివరణ కోరగా... ఆ నిర్మాణం గురించి మాకేం సంబంధం లేదని,ఇరిగేషన్ శాఖకు ఫిర్యాదు చేయండని బదులిచ్చారు.
తహసీల్దార్ సయ్యద్ మతిన్