27-06-2025 06:55:59 PM
కేజీబీవీ డార్మిటరీ అదనపు గదులకి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శంకుస్థాపన
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గం వేమనపల్లి మండలంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కస్తూరిబా బాలికల విద్యాలయంలో అదనపు డార్మిటరీ గదుల నిర్మాణ పనులకి శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శంకుస్థాపన చేశారు. నీల్వాయి గ్రామంలో కలెక్టర్ దీపక్ కుమార్ తో కలిసి రూ.66.00 లక్షల వ్యయంతో నిర్మించనున్న కస్తూరిబా బాలికల విద్యాలయo అదనపు డార్మిటరీ గదుల నిర్మాణ పనులను ప్రారంభించారు. అదే విద్యాలయంలో నూతనంగా నిర్మించిన ఇంటర్మీడియట్ తరగతుల గదులను ప్రారంభించారు.
వేమనపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభించారు. అదేవిధంగా వేమనపల్లి మండల కేంద్రంలో రూ.2.48 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కే.వి. విద్యుత్ ఉపకేంద్రాన్ని బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డo వినోద్ మాట్లాడారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల అభివృద్ధినీ కోరుకుంటున్నారు. అందులో భాగంగానే వేమనపల్లి మండలంలో ప్రజల సౌకర్యం, విద్యార్థుల సంక్షేమ కోసం అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.