calender_icon.png 27 June, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాడు మాటిచ్చాం... నేడు నెరవేర్చాం

27-06-2025 06:51:37 PM

పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పుష్పలత

హుజురాబాద్,(విజయక్రాంతి): నాడు మాటిచ్చాం నేడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి నెరవేర్చం ఇచ్చిన మాట కట్టుబడి ఉండేదే కాంగ్రెస్ ప్రభుత్వం అని జురాబాద్ మహిళా పట్టణ అధ్యక్షురాలు వేముల పుష్పలత అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని 13 వ వార్డులో రాచపల్లి సరూప అనే నిరుపేద మహిళ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు పట్టా శుక్రవారం అందజేసి ముగ్గు పోశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బిఆర్ఎస్ హయాంలో వర్షాకాలంలో ఇంట్లోకి వరద నీరు చేరేదని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చి నెరవేర్చలేదని, కాంగ్రెస్ నుండి బాధితురాలిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చామని, మంత్రి పొన్నం ప్రభాకర్, డిసిసి అధ్యక్షుడు కవంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు పట్టా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాదని చేత ప్రభుత్వమని అన్నారు.