10-06-2025 01:06:41 AM
కామారెడ్డి జూన్ 9 (విజయ క్రాంతి) 40 సంవత్సరాలుగా బీటీ రోడ్డు కోసం ఆ గ్రామ ప్రజలు ఏ ఎమ్మెల్యే గెలిచిన గ్రామానికి వచ్చిన బిటి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యేలు, అధికారులు, మంత్రులు, హామీలతోనే కాలం గడిపారు . నిధులు మాత్రం మంజూరు చేయలేదు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని సదాశివనగర్ మండల కేంద్రమైన గ్రామం లో బస్టాండ్ నుండి గ్రామం వరకు 2 కోట్ల 50 లక్షల నిధులతో బీటీ రోడ్డు పనుల కు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నిధులను మంజూరు చేయించారు.
ప్రస్తుతం ఆ బిటి రోడ్డుపనులు చురుకుగా వేగవంతంగా కొనసాగుతున్నాయి. బస్టాం డ్ నుంచి గ్రామం వరకు వెళ్లే ఈ రహదారి అనేక గుంతలమయంతో ఉండడం రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో పాటు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. అనేక గుంతలు ఏర్పడడం వల్ల చాలా సందర్భాల్లో ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు అదుపుతప్పి గుంతల్లో పడ్డారు.
వర్షాకాలం గుంతలుగా ఏర్పడి మోటార్ సైకిల్ పై వెళ్లే వారు చాలా సందర్భాల్లో గుంతల్లో పడి ఆస్పత్రి పాలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయని గ్రామ ప్రజలు చెప్పారు. గుంతల మయమైన ఈ రోడ్డు వల్ల గ్రామంలోని చాలా కుటుంబాలు గుంతల్లో పడి అనారోగ్యం పాలైన వారు కూడా ఉన్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.40ఏళ్లుగా ఈ రహదారి నీ బాగు చేసి గ్రామ ప్రజలను ఆదుకుందామన్న నాయకుడే కరువయ్యారని గ్రామస్తులు తెలిపారు.
బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి సదాశివ నగర్ గ్రామస్తులు తీసుకురావడంతో ప్రత్యక్షంగా రహదారిని చూసిన ఎమ్మెల్యే బిటి రోడ్డు వేయిస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు రెండు కోట్ల 50 లక్షల రూపాయల ప్రత్యేక నిధులను మంజూరు చేయించడంతో బీటీ రోడ్డు పనులు చురుకుగా కొనసాగుతున్నాయి.
మరో రెండు రోజుల్లో బీటీ రోడ్డు పనులు పూర్తయి ప్రజలకు సుందరంగా తీర్చిదిద్దిన రోడ్డు అందుబాటులోకి వస్తుందని ప్రజలు అన్నారు. సదాశినగర్ గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు పెద్దలు వివిధ పార్టీల నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా అభివృద్ధి విషయంలో రాజకీయాలు పార్టీల జెండాలు పక్కనపెట్టి అభివృద్ధి వైపు అడిగేస్తామని గ్రామ పెద్దలు తెలిపారు.
మా గ్రామానికి కావలసింది అభివృద్ధి రాజకీయాలు కావని వారన్నారు. గ్రామాన్ని ఎవరు అభివృద్ధి చేస్తే వారి వెంటనే తాము కూడా అడుగులో అడిగేసి ప్రోత్సహిస్తామని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును కొని యాడారు.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గ్రామానికి ఓట్ల కోసంవచ్చిన రాజకీయ పార్టీల నాయకులుఈ రహదారి నిర్మాణం కోసం ప్రత్యేకం గా నిధులు తీసుకువచ్చి సుందరంగా తీర్చి దిద్దుతామని వాగ్దానం చేయడం తప్పఅమలు పరచలేదు.ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండడం చూస్తున్న గ్రామస్తులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నిబద్ధతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ తెలియజేసిన గ్రామస్తులు, నాయకులు అభినందిస్తున్నారు.