29 August, 2026 | 12:41 PM

Breaking News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేల ఫొటోలకు పాలాభిషేకం   •   ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •  

సీపీఎం ఆధ్వర్యంలో కమిషనర్ కు వినతి

31-07-2025 05:17 PM

కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పురపాలకలో రహదారులు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఆనంద్, ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ... 1952లో ఏర్పడిన కాగజ్ నగర్ మున్సిపాలిటీ పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి నోచుకోలేదు.

దీనికి ప్రధాన కారణం మాస్టర్ ప్లాన్ లేకపోవడమే నన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రహదారులు విస్తరించకపోవడం, మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలకే పరిమితమైందన్నారు. మున్సిపాలిటీలో మురుగు కాలువలు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల ను అరికట్టడంలో అధికారులు విఫలమైనట్లు ఆరోపించారు. పట్టణంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. సత్వరమే చర్యలు తీసుకోవాలని అవినీతిపత్రంలో కోరారు.