31-05-2025 12:13:03 AM
భద్రాద్రి కొత్తగూడెం మే 30 (విజయ క్రాంతి)అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సహాకారం, సమిష్టి కృషితో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చి దిద్దుకుందామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.
నియోజకవర్గ పరిధిలోని చుంచుపల్లి మండలం విద్యానగర్, వెంకటేశ్వర కాలనీ, రామాంజనేయ కాల నీ, ఎన్ కె నగర్, నంద తండా గ్రామపంచాయతీల పరిధిలో రూ.3.58కోట్ల ఈజీఎస్, సబ్ ప్లాన్ నిధులతో చేపట్టనున్న రోడ్లు డ్రైనేజి పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనులకు ఎమ్మెల్యే ప్రా రంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజావసరాలను గుర్తించి నిధుల మంజూరుకు కృషి జరుగుతోందని, ప్రాధాన్యత క్రమంలో పనులను పూర్తిచేస్తున్నామన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించామని, కనీస అవసరాలైన త్రాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీలు వంటి వాటికి ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ఎంపిడివో శుభాషిణి, ఎమ్మార్వో కృష్ణ, వివిధ శాఖల అధికారులు, సత్యనారాయణ, నాగేందర్, రాయల వెంకటేశ్వర్లు, రవి, నర్సింహారావు, గుప్తా, వసంత, శ్రీనివాసరెడ్డి, రమేష్ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, నాయకులు పొలమూరి శ్రీను, జక్రయ్య, భాగం మహేశ్వరరావు, భాగం మాధవరావు తదితరులు పాల్గొన్నారు.