calender_icon.png 30 May, 2025 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజృంభిస్తున్న కరోనా

27-05-2025 01:14:29 AM

  1. దేశవ్యాప్తంగా 1010 క్రియాశీల కేసులు
  2. కేరళలో అత్యధికంగా 430 కేసులు..
  3. ఏపీలో 4..తెలంగాణలో ఒక్క కేసు నమోదు
  4. వైరస్ బారిన పడి ఆరుగురు మృతి
  5. భయం వద్దు..జాగ్రత్తలు అవసరం: ఐసీఎంఆర్ చీఫ్ రాజీవ్ బహల్

న్యూఢిల్లీ, మే 26 : దేశంలో కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1010 ఉండగా, కేరళలో 430 కేసులు నమోదై ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో ప్రస్తుతం 104మంది కరోనాతో బాధపడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

వారం వ్యవధిలోనే 750 మందికి కొత్తగా కరోనా సోకిందని సోమవారం ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. కరోనా కొత్త వేరియంట్ల పట్ల భయాందోళనలు అవసరం లేదని, జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ సూచించారు.

ఆసియా దేశాల్లో కొవిడ్ వ్యాప్తి..

ఆసియా దేశాల్లో ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయ్‌లాండ్‌తో పాటు చైనాలోనూ కొవిడ్ వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేలసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తికి జేఎన్.1 వేరియంట్, దాని ఉపరకాలే కారణమని అధికారులు చెబుతున్నారు.

జేఎన్.1 ఉపరకాలైన ఎల్‌ఎఫ్.7, ఎన్‌బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని సింగపూర్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. జ్వరం, ముక్కుకారడం, గొంతునొప్పి, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని, బాధితులు నాలుగు రోజుల్లో కోలుకుంటున్నారని వైద్యనిపుణులు చెబుతున్నారు.

దేశంలో పరిస్థితి ఇలా..

ఆసియా దేశాల్లో ప్రబలుతున్న ఉపరకాలే భారత్‌లోనూ గుర్తించినట్లు, ఇటీవల ఇండియన్ సార్స్ జీనోమిక్స్ కన్సార్టియం తెలిపింది. కాగా, కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం దేశంలో రాష్ట్రాల వారీగా కేసులు ఇలా ఉ న్నాయి.

కేరళలో 430, మహారాష్ట్ర 210, ఢి ల్లీ 104, గుజరాత్ 83, తమిళనాడు 69, కర్ణాటక 47, ఉత్తరప్రదేశ్ 15, రాజస్థాన్ 13, పశ్చిమబెంగాల్ 12, పుదుచ్చేరి 9, హర్యానా 9, ఏపీ 4, మధ్యప్రదేశ్ 2, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, గోవా, బిహార్ రాష్ట్రాల్లో ఒక్కొక్క కేసు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో ముగ్గు రు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు కొవిడ్‌తో మరణించినట్లు అధికారులు చెప్పారు.

ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్త: ఐసీఎంఆర్ చీఫ్

కరోనా కొత్త వేరియంట్ల పట్ల భయాందోళనలు అవసరం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ రాజీవ్ బహల్ సూచించారు. ప్రస్తుత పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, ప్రజలు ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం మేలని చెప్పారు. క్యాన్సర్ రోగులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు ఎలాంటి ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. కేసులు నమోదవుతున్నప్పటికీ తీవ్రత తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.