25 July, 2026 | 10:48 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని అంతం చేయాలి

31-05-2024 01:27 AM

ఉద్యోగులను అభినందించిన ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో గురువారం ఏసీబీ కార్యాలయంలో త్రైమాసిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా పనిచే స్తున్న ఏసీబీ సిబ్బందిని ఆయన అభినందించారు. 2024 ఏప్రిల్, మే నెలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన హోంగార్డులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో సహా 220 మంది అధికారులు, ఉద్యోగులకు నగదుతో పాటు ప్రశంస పత్రాలను అందజేశారు. రాబోయే రోజుల్లో మరింత కృషి చేసి ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతిని అంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఏఆర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.