కురవి దేవాలయ హుండీ లెక్కింపు
26-03-2026 01:48 AM
మహబూబాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుండి 24 మార్చి వరకు 21 హుండీల్లో భక్తులు వేసిన కానుకలను లెక్కించారు. ఇందులో స్వామివారి ఆలయంలోనీ హుండీలో 23,17,756 రూపాయలు కానుకలుగా లభించగా, అమ్మవారి ఆలయంలోనీ హుండీలో 7,05,042 రూపాయలు లభించినట్లు అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొర్ను రవీందర్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.




