22-05-2025 06:21:46 PM
విశ్వహిందూ పరిషత్ జిల్లా మహిళ ఇంచార్జి ముల కవిత..
పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లా విశ్వహిందూ పరిషత్ మాతృశక్తి దుర్గావాహిని ఆధ్వర్యంలో హైందవ పూజనీయ, సకలదేవత స్వరూపంగా నమ్మి కొలిచే గోవుల వంశాన్ని గోమతాని సంరక్షించాలని పెద్దపల్లి ఇంచార్జి మూల కవిత అధ్వర్యములో పెద్దపల్లి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గోవధ నిషేదించాలని ఆర్టికల్ 48 ని ఖచ్చింతంగా అమలు చెయ్యాలని, గోఆధారిత వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోస్టహించాలని, గోరక్షక్ దాళ్ కార్యలార్తలకు అండగా వుండాలని, గోవుని జాతియ జంతువుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యాక్రమంలో మహిళా నాయకులు మాతృశతి జిల్లా సమయోజికా ఠాకూర్ తారాబాయి, నగర సమయోజిక ఇంచార్జి ముల కవిత, సహ స్మయోజిక రంగు వాణి, సత్సంగ్ ప్రముఖ్, మంతెన వేదశ్రీ, నగర దుర్గావాణి, సమ్యోజిక శ్రీవాణి రెడ్డి, ప్రముఖ అడ్వకేట్ ఝాన్సీ పాల్గొన్నారు.