30 August, 2026 | 9:02 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

ఓసి క్లబ్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

31-07-2025 07:32 PM

సిపిఐ రిలే నిరాహార దీక్ష 

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రం నడిబొడ్డున సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన 50 కోట్ల విలువైన ఓసి క్లబ్ ను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓసి క్లబ్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు గురువారం మున్సిపల్ సిపిఐ మాజీ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కొందరు ప్రైవేటు వ్యక్తులు తమ చేతుల్లోకి తీసుకున్నారని, ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా కాపాడాలని మహబూబాబాద్ ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్ళామని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోతే ఓసి క్లబ్ స్వాధీనం కొరకు దశల వారి ఆందోళన చేస్తామని ఆగస్టు 4న కలెక్టరేట్ ముట్టడి చేపట్టనున్నట్లు ప్రకటించారు.