31-07-2025 07:29:19 PM
నిర్మల్,(విజయక్రాంతి): దిల్వార్పూర్ మండలం కాల్వ తండాలో గురువారం విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి చెందినట్లు రైతు బానోతు నవీన్ తెలిపారు. ఉదయం ఎడ్లను మేత మేయడానికి వదిలిపెట్టగా పంట పొలాల్లో తెగిపోయిన వైర్లు తగలడంతో షాక్ గురై ఎద్దు మృతి చెందినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దాని విలువ 50 వేల వరకు ఉంటుందని రైతు తెలిపారు.