28-05-2025 12:00:00 AM
మహబూబాబాద్, మే 27 (విజయక్రాంతి): రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తన స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి కోటి 25 లక్షల రూపాయలను మంజూరు చేశారు. నిధుల విడుదలకు సంబంధించిన వివరాలను ఎంపీ రవిచంద్ర తన సోదరుడు వద్దిరాజు కిషన్ ఇనుగుర్తి మండల కేంద్రంలో ప్రకటించారు.
పెనుగుర్తి మండలంలోని ఇనుగుర్తికి 20 లక్షలు, చిన్న నాగారం కు 20 లక్షలు, కోమటిపల్లి కి 25 లక్షలు, తారా సింగ్ తండాకు 20 లక్షలు, చిన్న ముప్పారంకు 15 లక్షలు, మీఠ్యా తండాకు 10 లక్షలు, పెద్ద తండా కు 5 లక్షలు, లక్ష్మీపురం కు 5 లక్షలు, పాత తంగాకు ఐదు లక్షలు కేటాయించారు.
నిధులు మంజూరు చేసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కు, కృషిచేసిన జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావుకు ఆ పార్టీ నాయకులు కృతజ్ఞతలు చెప్పారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ లు దీకొండ వెంకన్న, గుండా వెంకన్న, కసర బోయిన విజయ్ యాదవ్, నీలం యాకయ్య, నారాయణరెడ్డి, రాజు నాయక్, నరేష్ నాయక్, బేతమల్ల చంద్రయ్య, మహేష్, పింగళి శ్రీనివాస్, పప్పుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.