28-05-2025 12:00:00 AM
జనగామ, మే 27 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం లో జనగామ పట్టణ బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు జాయ మల్లేష్ కురుమ ఆధ్వర్యంలో రాజీవ్ యువ వికాసం పథకంకి ఎలాంటి షరతులు పెట్టకుండా పథకనీ అమలు చేయాలని BC సంక్షేమ డెవలప్మెంట్ జిల్లా అధికారి రవీందర్ నీ కలసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దూడల సిద్దయ్య గౌడ్ మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మపూరి శ్రీనివాస్ పాల్గొని. మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం కోసం అప్లికేషన్ చేసుకున్న వారందరికీ సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా పథకాన్ని అమలు చేయాలని బీసీ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నా.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా పథకాన్ని అమలు చేయాలని చెప్పడం జరిగింది. కానీ రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్లు తీసుకొని అధికారులు బ్యాంకులోకి వెళ్లి సిబిల్ స్కోర్ చెక్ చేస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం దృష్టికి రావడం జరిగింది. కావున సిబిల్ స్కోర్ ప్రాధాన్యతతో సంబంధం లేకుండా పథకాన్ని అమలు చేసే విధంగా చూడాలని కోరడం జరుగుతుంది.
అలాగే నిజమైన అర్హులను గుర్తించి రాజీవ్ యువ వికాస పథకం వర్తింపచేయాలని పైరసీలకు తావు లేకుండా చూడాలని కోరడం జరిగింది. అర్హులైన వారి జాబితాను ముందుగానే ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం తర్వాత విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా రజక చైతన్య సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎదునూరి రవీందర్, మాజీ MPTC సలేంద్ర శ్రీనివాస్ యాదవ్, గుజ్జుల మధు, దేవర సత్యనారాయణ , వికలాంగుల సంఘం జనగామ జిల్లా అధ్యక్షులు మేకల సమ్మయ్య, జాంగిర్ తదితరులు ఉన్నారు.