19-07-2025 12:52:23 AM
అభివృద్ధి పనుల నిమిత్తం కర్ణాటక సీఎం నిర్ణయం
బెంగళూరు, జూలై 18: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసు కున్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 50 కోట్ల గ్రాంట్ విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. పార్టీలో అంతర్గతంగా జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం నిధులు సరిపోవడం లేదని కర్ణాటక పార్టీ ఇంఛార్జీ రణదీప్ సుర్జేవాలా ఎదుట ఎమ్మెల్యేలు మొర పెట్టుకు న్నారు.
బెంగళూరులోని పార్టీ ఆఫీస్లో విడివిడిగా ఒక్కో ఎమ్మెల్యే ఆయనతో మాట్లా డారు. నిధుల జాప్యంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కీలక ప్రాజెక్టులు కుంటుపడుతున్నాయన్నారు. ఈ విషయాన్ని సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అంతర్గత చర్చ అనంతరం ప్రతి ఎమ్మెల్యేకు 50 కోట్లు ఇవ్వాలని సిద్ధరామయ్య నిర్ణయించారు.