31-05-2025 12:21:10 AM
సారంగాపూర్,(విజయక్రాంతి): ఇటీవల విడుదలైన పది ఫలితాల్లో మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యొక్క నలుగురు విద్యార్థినిలు తమ సత్తాను చాటుకున్నారు. చదివింది ప్రభుత్వ పాఠశాలలోనేనైనా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అద్భుతమైన మార్కులను సాధించారు. పరీక్షల్లో విద్యార్థినులు కనబర్చిన ప్రత్యేకమైన ప్రతిభను గ్రామస్తులు అభినందించారు.
తమ గ్రామానికి పేరు ప్రక్యాతలు తెచ్చి పెట్టినందుకు, వారి ద్వారా తమ గ్రామ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రతి గ్రామానికి ఆదర్శమౌతున్నందుకు సంతోషంగా ఉందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినిలు గొప్పగా మార్కులు సాధించేలా ప్రోత్సాహించి, విద్యని బోధించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి విద్యార్థీ ప్రభుత్వ పాటశాలలో చదివి ఉన్నతమైన కొలువులు సాధించాలని గ్రామస్థులు కోరుతున్నారు.