దేవాలయాల్లో భక్తుల రద్దీ
23-03-2026 12:58 AM
మహబూబాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని, వరంగల్ జిల్లాలోని వివిధ దేవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలుగు సంవత్సరాది తరువాత దైవదర్శనం కోసం భక్తులు తమ ఇలవేల్పు దేవుళ్ళ సన్నిధికి రావడంతో మేడారం, వరంగల్ నగరంలోని భద్రకాళి దేవాలయం, కురవి లోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.




