రఘువంశీ మ్యాచ్ ఫీజులో కోత
28-04-2026 12:24 AM
ముంబై, ఏప్రిల్ 27: కోల్కతా నైట్రైడ ర్స్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీపై ఐపీఎల్ పాలక మండలి కఠిన చర్యలు తీసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో మ్యాచ్ ఫీజులో కోత విధించింది. లక్నో జట్టు ‘అబ్ స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కోసం అప్పీల్ చేసింది.
దీంతో పలుమార్లు రీప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్... రఘువంశీ దిశ మార్చుకున్నాడని నిర్ధారించి అతడిని అవుట్గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై రఘు వంశీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోపం గా మైదానాన్ని వీడాడు. హెల్మెట్ను విసిరేసి అసంతృప్తి వెళ్లగక్కాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి చర్యలకు దిగింది. అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు.. ఓ డిమెరిట్ పాయింట్ కూడా జత చేస్తున్నట్టు ప్రకటించింది.






