క్వార్టర్ ఫైనల్లో భారత్
ఆసీస్పై 5 విక్టరీ
థామస్ & ఉబెర్ కప్
డెన్మార్క్, ఏప్రిల్ 27: థామస్ అండ్ ఉబెర్ కప్లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. సమిష్టిగా రాణించిన భారత షట్లర్లు ఆస్ట్రేలియాపై 5 క్లీన్స్వీప్ విజయాన్ని అందించారు. దీంతో భారత్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఆసీస్పై మొదట లక్ష్యసేన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 21 21 స్కోరుతో లక్ష్యసేన్ స్టీఫెన్ సామ్పై విజయం సాధించాడు. మరో సింగిల్స్ మ్యాచ్లో ఆయుశ్ శెట్టి 21 21 స్కోరుతో శ్రేయ్ దండ్పై గెలుపొందాడు.
తర్వాత జరిగిన డబుల్స్ మ్యాచ్లోనూ భారత్ ఆధిపత్యం కనబరిచింది. సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి 21 21 హిదాయత్ విజయం సాధించాడు. అలాగే హెచ్ఎస్ ప్ర ణయ్ 21 21 స్కోరుతో హూండా భూపతిపై గెలుపొందాడు. ఇక చివరి డబుల్స్ మ్యాచ్లోనూ హరిహరన్ జోడీ 21-- 21 స్కోరుతో విజయం సాధించింది. విశేషమేమిటంటే ఐదు మ్యాచ్లలో నూ భారత ఆటగాళ్లు ఒక్క గేమ్ కూడా ఓడిపోకుండా విజయాన్ని అందుకున్నారు.






