మణిదీప్ రెడ్డి కుటుంబానికి దత్తాత్రేయ పరామర్శ
ఎల్బీనగర్, జులై 13 : ఫిన్లాండ్ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లిన ఎల్బీనగర్ నియోజకవర్గం, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కు చెందిన మణిదీప్ రెడ్డి కొన్ని నెలలుగా కనిపించకపోవడం రెండు రోజుల ముందు ఫిన్లాండ్ భారత రాయబార సంస్థ నుంచి మణిదీప్ రెడ్డి సముద్రంలో మునిగి చనిపోయాడని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం హర్యానా మాజీ గవర్నర్ బం డారు దత్తాత్రేయ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థి త ల్లిదండ్రులు దత్తాత్రేయతో మాట్లాడుతూ... తమ కుమారుడు మరణించలేదని ఎవరిదో శవం చూపించి తమ కుమారుడు అని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలలు గా సముద్రంలో ఒక వ్యక్తి మునిగిపోతే మృ తదేహం కుళ్ళిన స్థితిలో ఉంటుందని, కానీ ఫింగర్ ప్రింట్ ఆధారంగా తమ కుమారుడని ఆ దేశం ఎలా నిర్ధారిస్తుందని? ప్రశ్నిం చారు. అక్కడ దొరికిన మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు చేయించాలని, తమ కుమా రుడు బతికే ఉన్నాడన్న నమ్మకం తమకు ఇంకా ఉందని అన్నారు.
ఒకవేళ డీఎన్ఏ టె స్ట్ చేస్తే అది తమ కుమారుడు శవమే అని తేలితే ప్రభుత్వమే చొరవ చూపి ఆ మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలని కోరా రు. బండారు దత్తాత్రేయ ఫిన్లాండ్ లోని భా రత రాయబార సంస్థతో మాట్లాడి ఆ కుటుంబానికి తగిన న్యాయం చేస్తానని మాజీ గవర్నర్ దత్తాత్రేయ హామీ ఇచ్చారు.






