16-06-2025 01:24:53 AM
కొనసాగుతున్న ద్రోణి
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): మరాఠ్వాడ పరిసర ప్రాం తం నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతున్నదని, ఫలితంగా రాష్ర్టం లో 5 రోజులపాటు విస్తారంగా వ ర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం రాష్ర్టవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నది.
మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపా లపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, వరం గల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని హెచ్చరించింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామా బాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూ బాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.