calender_icon.png 16 June, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలనీలో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డికి వినతి

16-06-2025 01:25:06 AM

మేడ్చల్, జూన్ 15(విజయ క్రాంతి): తమ కాల నీలలో నెలకొన్న సమస్య లు పరిష్కరించాలని వివిధ కాలనీల ప్రజలు ఆదివారం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మ చ్చ బొల్లారం డివిజన్లో ఎస్ వి ఎస్ పవన్ రెసిడెన్సి, జనహితం ఆర్ యు బి సమీపంలో నాలాలో పూడిక చేరిందని దీంతో మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తోందని తెలిపారు.

పూడిక తొలగించాలని, నాలా వెంబడి ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న భవనాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. వెస్ట్ వెంకటాపురం డివిజన్ దినకర్ కాలనీలో రాయుని చెరువు నుంచి వచ్చే మురుగునీటిని మళ్లించాలని కాలనీవాసులు కోరారు. అలాగే ఆషాడం బోనాలు నిర్వహణకు నిధులు మంజూరు చేయించాలని వివిధ కాలనీల ప్రజలు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కోరారు.