10 May, 2026 | 10:17 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

యాసిడ్ తాగి డీసీఎం డ్రైవర్ ఆత్మహత్య

08-08-2024 03:23 AM

ఘట్‌కేసర్, ఆగస్టు 7: ఆర్ధిక ఇబ్బందులతో ఓ డీసీఎం డ్రైవర్ యాసిడ్ తాగి ఆత్మ హత్యకు పాల్పడిన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాలు.. మహబూ బాబాద్ జిల్లా, కురవి మం డలం, చాంద్య తండాకు చెందిన మాలోతు వాసు (32) కొన్నేళ్లుగా నగరంలోని బోడుప్పల్‌లో నివా సం ఉంటున్నాడు. వృత్తి రీత్యా డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్న వాసు గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది గతనెల 31న యాసిడ్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు  పోలీ సులు అతడిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికి త్స పొందుతూ బుధవారం వాసు మృతి చెందా డు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని బంధువులకు అప్పగించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.