కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించిన డీసీపీ
27-03-2026 12:00 AM
చెన్నూర్, మార్చి 26: ‘అరైవ్ - అలైవ్’ కార్యక్రమంలో భాగంగా చెన్నూర్ సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో బస్టాండు ఆవరణలో వాహన డ్రైవర్లకు ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని గురువారం మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ సందర్శించారు. అనంతరం గాంధీ చౌక్లో చలి వేంద్రాన్ని డీసీపీ భాస్కర్, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్ పట్టణ ఎస్ఐలు శ్యాంపటేల్, సుబ్బారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




